స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్లాస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. అంతేకాదు తొలి సారి ప్యాన్ ఇండియా చిత్రంలో బన్నీ నటించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ మూవీ నుంచి ఏ చిన్న వార్త బయటకొచ్చినా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతున్న విషయం బయటకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా అవాక్కైనా తెగ ఖుషీ అయ్యారు. ఇక తాజాగా ఇదే పార్ట్‌లకు సంబంధించిన మరో క్రేజీ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

పుష్ప మూవీలో మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ పవర్ ఫుల్ విలన్‌గా బన్నీని ఢీకొట్ట బోతున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ హాఫ్‌తో పోల్చితే ఫహద్ విలన్ క్యారెక్టర్ రేంజ్ అంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువ ఉంటుందట. అంతే కాకుండా ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే సెకండ్ పార్ట్ బిగినింగ్‌లో విలన్ రోల్ ఎలా ఉంటుందో డైరెక్టర్ చూపించేస్తాడని టాక్ నడుస్తోంది.
 
కాగా.. సెకండ్ పార్ట్‌ షూటింగ్‌ కూడా ఇప్పటికే ప్రారంభమై కొంత మేర కంప్లీట్ అయినట్లు కూడ వార్తలొస్తున్నాయి. మొత్తానికి పుష్ప‌ను సాలిడ్‌గా ప్రెజెంట్ చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారని ఈ గాసిప్‌లను బట్టి చేస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే గతేడాది నవంబర్‌లోనే ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట దర్శకనిర్మాతలు. స్టోరీ చాలా రేంజ్ ఉన్న కథనీ, అందువల్ల రెండున్నర గంటలో చెప్పేయడం సాధ్యం కాదు కనుకే రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే 'పుష్ప' సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించనున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు 13న ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: