రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నారు. ముందుగా వీటిలో రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా జులై చివరిలో దీన్ని విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు హోంబలె ఫిలింస్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ లో కూడా యాక్ట్ చేసుకున్న ప్రభాస్ ఆ సినిమాలో అండర్ వరల్డ్ డాన్ పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు. అలానే వీటితో పాటు బాలీవుడ్ యువ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ కూడా ప్రభాస్ చేస్తున్నారు. అందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్మూవీ ని నిర్మిస్తున్నారు. ఇక వీటి అనంతరం త్వరలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు నిర్మించనున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో కూడా ప్రభాస్ యాక్ట్ చేయనున్నారు.

అసలు విషయం ఏమిటంటే కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో వార్ మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ మూవీ కోసం ఇప్పటికే స్టోరీ సిద్ధం చేసి ప్రస్తుతం దాని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని, కాగా ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా ఒక హాలీవుడ్ నటిని ఎంపిక చేశారట సిద్దార్ధ్. ఒక ప్రముఖ బాలీవడ్ నిర్మాణ సంస్థ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపుగా రూ.500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: