మంచు మనోజ్ హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా..?’ మూవీ గుర్తుందా..? ఆ సినిమాలో హీరోయిన్‌గా స్నేహా ఉల్లాల్ నటించింది. అయితే ఆమెతో పాటో నెగెటివ్ హీరోయిన్‌గా రియా సేన్ నటించింది. చివరికి విలన్‌గా మారి చనిపోతుందా క్యారెక్టర్. అయితే ఆ సినమా తర్వాత రియా సేన్ పెద్దగా టాలీవుడ్ తెరపై కనిపించలేదు. ఆ సినిమాపై రియా చాలా ఆశలే పెట్టుకుంది. కానీ అనుకున్నంత రేంజ్‌లో సినిమా హిట్ కాకపోవడంతో ఆమెకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు.

ఇక బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించినా అక్కడా గుర్తింపు దక్కలేదు. దీంతో అమ్మడు ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయిపోయింది. దీంతో సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. వరుస ఫోటోషూట్లతో యోగా భంగిమలతో కుర్రకారులో హీట్ పెంచేస్తోంది. ఈ మధ్యనే బాత్ టబ్‌లో రియా చేసిన ఫోటోషూట్‌ విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత యోగా పాఠాల్ని చెప్పేందుకు టీచర్‌గా అవతారమెత్తింది. యోగా క్లాసులు చెబుతున్న ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

ఇక ఇవన్నీ చాలవనుకుందో ఏమో.. తాజాగా తన ఎద అందాలను చూపుతూ బికీనీలోనే దర్శనమిచ్చింది. యువత గుండెల్ని గుచ్చేసింది. తాజాగా స్టార్ట్ చేసిన స్పా బిజినెస్ నేపథ్యంలో ఈ సెల్ఫీ ఫోటోలను రియా షేర్ చేసింది. దీనికి ఫిషీ అంటూ ఓ ఎమోజీని కూడా జత చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడతో యూత్ ఈమె అందాలకు ఫిదా అంటున్నారు.

ఇదిలా ఉంటే రియా కొత్తగా ‘బలిస్యా ఈవెంట్ ప్లానర్’ పేరుతో స్పా బిజినెస్‌ ప్రారంభించింది. బలిస్వా అనేది రిసార్ట్ కం వెల్‌నెస్ సెంటర్. ఇక్కడ వెల్‌నెస్ మైండ్ ఫ్రీనెస్‌కి రియా సేవలు అందిస్తుందట. అందులో భాగంగానే ఆమె తాజాగా ఈ ఫోటోలు షేర్ చేసింది. ఇలాంటి ఫోటోలతో మరి మైండ్‌ మరింత వేడెక్కుతుంది కానీ ఫ్రీనెస్ ఎలా వస్తుందో మరి రియానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: