యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో " ఆర్.ఆర్.ఆర్ " సినిమాలో నటిస్తున్నాడు. హిస్టారికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజు గాను, ఎన్టీఆర్ కొమరం భీమ్ గాను, నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా తరువాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే.

 త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఇండస్ట్రీ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మద్య ప్రశాంత్ నీల్ సతీమణి కూడా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందంని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రశాంత్తమిళ్ స్టార్ హీరోతో కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి.

దీంతో ఎన్టీఆర్ తో నీల్ సినిమా లేనట్టేనా అని అభిమానులు నిరుత్సాహనికి లోనయ్యారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎన్టీఆర్ నేషనల్ మీడియా కు ఇచ్చిన ఇటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్నీ విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని తారక్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సెన్సేషనల్ మాస్ కాంబో సెట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ "కే‌జి‌ఎఫ్2", సలార్ " వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: