తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. నాని అష్టాచమ్మా సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైయ్యాడు. ఇక అష్టాచమ్మా సినిమా నుంచి వీ సినిమా వరకు నాని తన సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

నాని ఒకవైపు మాస్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు క్లాస్ సినిమాల్లో నటించారు. ఇక సహజమైన నటనతో నాచురల్ స్టార్ గా మంచి పేరు, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నాని ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎంసీఏ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ లేకపోయినా నాని మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు.

రీసెంట్ గా నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా శ్యామ్ సింగరాయ్ సినిమా కొంతమేర షూటింగ్ పూర్తైంది. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిటెక్టివ్ రోల్ లో నాని నటిస్తున్నారని తెలుస్తోంది. థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీగా శ్యామ్ సింగరాయ్ తెరకెక్కనుందని నాని కృతిశెట్టి మధ్య లవ్ ట్రాక్ ఉంటుందని సమాచారం. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక నాని డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసి నాని ఫ్యాన్స్ లో కొంతమంది నాని రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: