మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నారు.. సరిలేరు నీకెవరు సినిమా తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా రూపొందుతుంది. మహేష్ బాబు కూడా చాలా గ్యాప్ తర్వాత చేస్తుండడం, అందులోనూ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తుండడం తో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వచ్చిన సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది. దాంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్..  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైనేమెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది..  

మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు చాలా మంది.. ఈ సినిమా తర్వాత త్వరలోనే మహేష్ త్రివిక్రమ్ కాంబో లోని సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ల తర్వాత ఈ కాంబో మళ్ళీ సినిమా చేయడంతో అందరు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  త్రివిక్రమ్ స్టైల్ లో ఎలా ఉంటుందో తెలిసిందే.. తన సినిమాల్లో మంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్, మెసేజ్ కూడా జొప్పించి సినిమాలు చేస్తుంటారు..

అయితే ఇది ఓల్డ్ ఫార్మటు ఇప్పుడు ఆ ట్రెండ్ కాకపోవడంతో మహేష్ తో ఏ తరహా సినిమా తెరకెక్కిస్తాడా అని అందరు ఎదురుచూస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా మ్యూజిక్ విషయంలో త్రివిక్రమ్, మహేష్ బాబు ఒకే మాటమీద ఉండడంలేదట.. మహేష్ బాబు దేవిశ్రీ ని తీసుకుందామని సూచిస్తే వద్దు అని చెప్తున్నాడట త్రివిక్రమ్.. గతంలో దేవి తో పనిచేసిన అనుభవం ఉన్నా త్రివిక్రమ్ మహేష్ ఐడియా ని రిజెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. గతకొన్ని సినిమాలుగా థమన్ తో పనిచేస్తున్న త్రివిక్రమ్సినిమా కి కూడా థమన్ తో చేయడానికి ఇష్టం చూపిస్తున్నాడట..  




మరింత సమాచారం తెలుసుకోండి: