టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకేసారి ఆరు సినిమాలను తెరకెక్కిస్తూ రికార్డు నెలకొల్పాడు. ఇటీవలే వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు ఇంకా క్రేజీ ప్రాజెక్ట్ లను చాలానే రూపొందిస్తున్నాడు.. అందులో ఒకటి శంకర్, రామ్ చరణ్ తేజ్ ల సినిమా అయితే మరొకటి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా.. వంశీ పైడిపల్లిసినిమా కు దర్శకుడు.. ఇప్పటివరకు తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన దిల్ రాజు ఈమధ్య ఏర్పడిన కొన్ని పరిస్థితుల వల్ల వేరే భాషల హీరోలకి షిఫ్ట్ అవుతున్నారు..

తెలుగు హీరోలు అందరు పాన్ ఇండియా చిత్రాలు, భారీ చిత్రాల దర్శకులతో ముందుకు వెళ్తుంటే దిల్ రాజు కి హీరోల సమస్య మొదలవడంతో ఇతర భాషల వైపుకు వెళ్తున్నాడు.. తమిళ హీరోలనేకాకుండా కన్నడ, మలయాళ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు.. ఇకపోతే భారీ బడ్జెట్ సినిమాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలను దిల్ రాజు ఎలా ఢీల్ చేస్తాడో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి సినీ వర్గాలు..  150కోట్ల బారి బడ్జెట్ తో తెరకెక్కించనున్న శంకర్, రామ్ చరణ్ లకే దాదాపు సగానికి పైగా రెమ్యునరేషన్ కే వెళ్లిపోతుంది.  

విజయ్ వంశీపైడిపల్లి సినిమాలలో కూడా సాగనికంటే ఎక్కువ డబ్బు రెమ్యునరేషన్ లేక్ పోతుంది. టోటల్ గా 170 కోట్లవరకు ఈ సినిమా కి బడ్జెట్ కాగా ఈ రెండు భారీ ప్రాజెక్ట్ లను ఎలా డీల్ చేస్తారో అని చూస్తున్నారు.. ఈ విధంగా దిల్ రాజు కోలీవుడ్ కు సంబంధించిన వారికోసం మొదటిసారి 300కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు. ఇంతవరకు 100కోట్ల బడ్జెట్ లో సినిమాను టచ్ చేయని రాజు గారు మొదటిసారి అంతకుమించి అనేలా ఆ రెండు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఆర్థిక లావాదేవీలను దిల్ రాజు ఎలా తట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: