ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో సహజమైన నటనతోనూ, చక్కటి అభినయంతోను ఆకట్టుకునే హీరోయిన్స్ లో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీలో బలమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, వంటి భాషలలొ హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు యొక్క పాటలు యూట్యూబ్ లో స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని సంచలన రికార్డులను నమోదు చేశాయంటే ఈ హైబ్రిడ్ పిల్ల క్రేజ్.. ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 ప్రస్తుతం ఈ అమ్మడు వరుస తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దగ్గుబాటి రానా నక్సలైట్ గా నటిస్తున్న " విరాట పర్వం ", నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పిరియడికల్ డ్రామా " శ్యామ్ సింగ రాయ్ ", నాగ చైతన్య నటిస్తున్న " లవ్ స్టోరీ " వంటి సినిమాలలో సాయ్ పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా రోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే సాయ్ పల్లవి బాలీవుడ్ ఎంట్రీ పై ఇంత వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో సాయ్ పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై మరో వార్త చక్కర్లు కొడుతుంది. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ హిట్ చిత్రం " చత్రపతి " మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సాయ్ పల్లవిని హీరోయిన్ గా ఓకే చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. అయితే కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసే సాయ్ పల్లవి ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతుందా.. లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కు పల్లవి ఓకే చెబుతే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగట్టుగా ఈ అమ్మడు గ్లామర్ డోస్ కు సిద్దం అవుతుందా అనే సందేహాలు కూడా అందరిలోనూ నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి సాయ్ పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. అక్కడి ప్రేక్షకులను కూడా తన నటనతో ఫిదా చెయ్యడం ఖాయం. మరి ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఓకే అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: