యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ఏ విషయము చెప్పనవసరం లేదు. ఏ సినిమాలోనైనా సరే, ఏ పాత్రలోనైనా సరే ఇట్టే లీనమైపోయి నటించే సత్తా ఉండడమే కాకుండా, తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదగబోతోన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ మొట్టమొదటి సారి జాతీయ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో చాలా విషయాలను ముచ్చటించాడు. మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి సంయుక్తంగా నటించబోతోన్న  పాన్ ఇండియా మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే, ఇలాంటి లాక్ డౌన్ లు ఎన్ని రోజులు ఉన్నా సరే , ఆర్ఆర్ఆర్ మూవీనీ థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాము. ఇలాంటి సినిమాలు కచ్చితంగా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. సాధారణంగా కొన్ని సినిమాలను ఓటీటీలో కన్నా థియేటర్లో చూస్తేనే ఆ మజా ఏంటో తెలుస్తుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

అసలు ఆర్ఆర్ఆర్ మూవీని ఓటీటీ లో రిలీజ్ చేయాలని అనుకోవడం లేదని ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టారు. నిజానికి తనకు పాన్ ఇండియా అనే పదం నచ్చదని, దేశంలోని చాలా భాషల్లో ఒక సినిమాను రిలీజ్ చేసి, అందరికీ చూపించడం మాత్రమే అని చెప్పాడు. ఇక అంతే కాకుండా రియల్ హీరో ల గురించి దేశం మొత్తం తెలియాలని, ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్ర కొమరం భీమ్.ఈ  పాత్ర కోసం చాలా పరిశోధనలు చేశాము అని చెప్పాడు..

అలాగే హాలీవుడ్ లో అవకాశం వస్తే చేస్తారా ?  అని అడిగినప్పుడు, హాలీవుడ్ లో అవకాశం వస్తే ఏ హీరో వదులుకోడు. ఇక నేను కూడా అంతే అంటూ తన మనసులోని విషయాలను ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: