తొలి మూడు సినిమాలు గా సరైన సక్సెస్ లు లేని అఖిల్ నాలుగో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.. ఈనేపథ్యంలో అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధంచేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. అంతేకాకుండా ఆ సినిమా కి సురేందర్ రెడ్డి ని సెట్ చేసుకుని అందరిని మరింత ఆశ్చర్య పరిచాడు.. టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మంచి పేరు ఉంది.. ఈనేపథ్యంలో హిట్ లేని అఖిల్ కి సురేందర్ రెడ్డి హిట్ ఇస్తాడని నమ్మకం అక్కినేని అభిమానుల్లో నెలకొంది..

ఏజెంట్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్  మూవీ ని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు మేకర్స్.. అయితే ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్న ఈ చిత్ర బృందానికి కరోనా అడ్డుకట్ట వేసింది.. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించగా అనిల్ సుంకర భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు..నూతన హీరోయిన్ అయినా సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది.. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఆరోచిత్రానికి రంగం సిద్ధమవుతుంది..

దానికి కొరటాల శివ ని సంప్రదించాడట నాగ్.. అయన కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చాడట.. ప్రస్తుతం ఆచార్య కంప్లీట్ చేసిన కొరటాల, ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ను కంప్లీట్ చేసి అఖిల్ తో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.. ఇదే నిజమైతే అఖిల్ కి మంచి ఛాన్స్ దొరికినట్లే అని చెప్పాలి.. అయన నాలోగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోని మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు టీజర్ కు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ సినిమాపై అంచనాలు పెంచింది.. పూజ హెగ్డే కథానాయిక గా నటించిన ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: