మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు ఫుల్ బిజీ గా ఉన్నారు.. ఓ వైపు పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ పనుల్లో ఉండగా మరోవైపు మహేష్ బాబు తో తెరకెక్కించబోయే సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ సినిమా కోసం రచయితగా మారాడు త్రివిక్రమ్.. గతంలో త్రివిక్రమ్ రచయితగా తీన్మార్ సినిమా చేయగా ఆ సినిమా అంతగా ఆడలేదు.. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని పవన్ అభిమానులు భయపడుతున్నారు.. మహేష్ బాబు తో కూడా సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు మొదలుపెట్టాడు త్రివిక్రమ్..

వీరి కాంబో లో కూడా రెండు సూపర్ హిట్ సినిమాలు రాగా మూడో సినిమా దానికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని స్టోరీ ని ట్రై చేస్తున్నాడట త్రివిక్రమ్.. ఈ సినిమా కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేయబోతున్నాడు.. మొత్తానికి త్రివిక్రమ్ ఇద్దరు టాప్ హీరోలతో ఒకేసారి సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు..  ఇద్దరు టాప్ హీరోలను మేనేజ్ చేయడమంటే మాములు విషయం కాదు.. అది ఒక్క త్రివిక్రమ్ కే సాధ్యం అని చెప్పొచ్చు..

ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ అందరిని కొంత అయోమయంలో పడేశాడు. మొదట్లో మణిశర్మ తో పనిచేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత దేవిశ్రీ, ప్రస్తుతం థమన్ లతో పనిచేస్తున్నాడు.. అయితే ఈ సినిమా కి ఎవరిని తీసుకుంటున్నాడా చెప్పకుండా అందరిని అయోమయంలో పడేస్తున్నాడు.. ఇప్పటికే  దేవి శ్రీ అని కొందరు, థమన్ అని కొందరు, లేదు మణిశర్మ అని కొందరు అంటున్నారు.. వీరి ముగ్గురు టాప్ సంగీత దర్శకులే అయినా వీరిలో ఎవరిని తీసుకుంటారో చెప్పడం లేదు.. కొత్తగా అనిరుధ్ పేరు ను కూడా తీసుకొస్తున్నారు.. మరి త్రివిక్రమ్ చూపు ఎవరి మీద పడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: