మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. తన పంథా కు భిన్నంగా సుకుమార్ చేసిన రంగస్థలం ప్రయోగం సక్సెస్ అయ్యిందని చెప్పాలి.. ఇప్పుడు కూడా అలాంటి రగ్డ్ సినిమా తో రాబోతున్నాడు సుకుమార్.. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుండగా రెండు భాగాలకు కలిసి దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుందట. ఇప్పటికే మొదటిభాగం షూటింగ్ పూర్తికాగా రెండో భాగం షూటింగ్ కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. సుకుమార్ సినిమా అంటే మొదటినుంచి అయన సినిమాలో ఐటెం సాంగ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది.. అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా లోనూ ఓ ఐటెం సాంగ్ పెట్టాడట. దీనికోసం మళ్ళీ పూజాహెగ్డే ని సంప్రదిస్తున్నారట.. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది పూజా. ఆ పాట తో పాటు సినిమా కూడా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సెంటిమెంట్ నేపథ్యంలో ఆమెను రిపీట్ చేసే అవకాశం ఉంది.