చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మలయాళం 'ప్రేమమ్' సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సాయి పల్లవి తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో భానుమతి పాత్ర లో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలెట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది.

అయితే ఆ తర్వాత వచ్చిన 'ఎన్జీకె', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత నిరుత్సాహాపడిన మళ్లి పుంజుకుని వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇక తాజాగా సాయి పల్లవికి బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అవకాశం రాగా.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆమె ఈ సినిమాను వదిలేసిందని టాక్ నడుస్తోంది.

ఆమె ప్రస్తుతం నాగ చైతన్య సరసన లవ్ స్టోరిలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి రానా ప్రధాన పాత్ర పోషిస్తున్న విరాటపర్వంలో కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో పాటు సాయి పల్లవి నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.

ఇక బెల్లంకొండ విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ మరో రీమేక్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్‌ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కర్ణన్ రీమేక్ రైట్స్‌ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: