జూనియర్ ఎన్టీయార్ టాలీవుడ్ యంగ్ టైగర్. టాప్ లెవెల్ హీరో. ఆయన ఆర్.ఆర్.ఆర్ మూవీ తరువాత కూడా వరసగా కొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఫ్యూచర్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి జూనియర్ పక్కా మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడు.

ఇక జూనియర్ ఎన్టీయార్ తో అరవింద  సమేత మూవీని తీసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని గురూజీ అని సంభోదిస్తాడు. అరవింద సమేత జూనియర్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆ తరువాత ఈ ఇద్దరూ కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. నిజానికి ఆర్.ఆర్.ఆర్ మూవీ తరువాత జూనియర్ చేయాల్సింది త్రివిక్రమ్ మూవీనే. అయితే మధ్యలో కొరటాల శివ లైన్ లోకి వచ్చేశాడు.  త్రివిక్రమ్ సడెన్ గా మహేష్ బాబు మూవీకి కమిట్ అయ్యాడు. ఈ భారీ ట్విస్ట్ ఏంటి. ఎందుకిలా జరిగింది అన్నదే ఇక్కడ చర్చ. జూనియర్ ఆర్.ఆర్.ఆర్ షూటింగులో బిజీగా ఉంటే ఆయన కోసం త్రివిక్రమ్ ఏడాది పాటు వెయిట్ చేశారు అంటున్నారు. అలాగే జూనియర్ కి సరిపడే ఒక అద్భుతమైన స్టోరీని కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు అన్నదీ ప్రచారంలోకి వచ్చింది.

అన్నీ బాగున్న టైమ్ లో ఎందుకు ఈ కాంబో మెటీరియలైజ్ కాలేదు అన్నదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉందిట. దీని మీదనే ఇపుడు అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. జూనియర్ కి త్రివిక్రమ్  కి మధ్య దూరం బాగా పెరిగింది అన్నదే ఆ ప్రచారం. జూనియర్ తాజాగా ఒక వెబ్ మీడియా ఇంటర్వ్యూ లో కూడా తాను చేయబోయే రెండు సినిమాలను ప్రకటించారు. అందులో కొరటాలది ఒకటి అయితే ప్రశాంత్ నీల్ ది మరొకటి.  మరి ఎక్కడా జూనియర్ తో కమిట్ అయిన సినిమా లేకపోవడం విశేషమే.

అలాగే మహేష్ బాబు సినిమా తరువాత త్రివిక్రమ్  చేయబోయే సినిమా విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం. అంటే ఇలా ఇద్దరూ వరసపెట్టి కొత్త సినిమాలు కమిట్ అవుతున్నారు కానీ తమ కాంబో గురించి  ఎక్కడా  మాట్లాడడం లేదు. దీంతో ఏదో జరిగింది అన్నదే ప్రచారంగా ఉంది. మరి జూనియర్ కోసం తయారు చేఇన కధను త్రివిక్రమ్  వేరే హీరోకు వాడేస్తారా లేక ఎప్పటికైనా ఆయనతో సినిమా ఉంటుందా అన్నదే చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: