సైరా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవి జంటగా నటిస్తుండగా రామ్ చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.. అయితే గత కొద్ది రోజులుగా లూసిఫర్ రీమేక్ సినిమాకి సంబంధించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.. ఈ సినిమా దర్శకుడు గా ఎంపికయిన మోహన్ రాజా సిద్ధం చేసిన స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చలేదని ప్రచారం జరుగుతోంది.. 


మరికొంతమంది అయితే మరో రెండు అడుగులు ముందుకు వేసి అసలు లూసిఫర్ రీమేక్ సినిమా నుంచి మోహన్ రాజ తప్పుకున్నాడని కూడా ప్రచారం చేశారు.. అయితే ఈ సినిమాకు సంబంధించి అవన్నీ ఒట్టి పుకార్లే అని తెలుస్తోంది మోహన్ రాజ ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్తో చిరంజీవిని మెప్పించాడని తెలుస్తోంది.. అలాగే చిరంజీవి మోహన్ రాజ ఆ మధ్య మూడు మీటింగ్స్ జరగ్గా ఆ మూడు మీటింగ్స్ పాజిటివ్ గానే జరిగాయని తెలుస్తోంది.. ఒకసారి కరోనా పరిస్థితులు సద్దుమణిగాక చిరంజీవి ఆచార్య షూటింగ్లో పాల్గొననున్నారు. 


కేవలం పదిహేను రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే ఆచార్య మిగిలి ఉంది అది పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దర్శకుడు కూడా ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని, దాదాపు అందరూ ఫైనల్ అయ్యారు అని అంటున్నారు. షూటింగ్ కి వెళ్లేముందు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని రామ్ చరణ్ తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: