రానా దగ్గుపాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమా నక్సల్ నాయకుడు రవి అన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవి అన్న పాత్రలో రానా చేస్తుండగా, అతడి ప్రేమించిన ఓ పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో  సీనియర్ హీరోయిన్ ప్రియమణితో పాటు నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఈసినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను మరింత అధికం చేశాయి. అయితే ఈ సినిమా గత నెల ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అంతేకాకుండా సినిమా థియేటర్లు కూడా మూతబడ్డాయి. వీటితో ఇప్పటికే తెలుగులోని అన్ని సినిమాలు కూడా తమ చిత్రీకరణను నిలిపివేశాయి. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టత లేదు.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు సబంధించిన అనేక వార్తలు వచ్చాయి.  ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో చిత్రాన్ని ఓటీటీ బాటపట్టించాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారని కూడా సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మూవీ మేకర్స్ స్పందించారు. విరాట పర్వం ఓటీటీ విడుదలపై వచ్చిన వార్తలన్నీ అబద్దాలని, వాటిలో ఏమాత్రం నిజం లేదని వారు అన్నారు.

 అంతేకాకుండా ఇప్పటికే  ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులను విక్రయించేశామని, థియేటర్ హక్కులను కూడా అమ్మేశామని వారు చెప్పారు. కాబట్టి ఎంత ఆలస్యం అయినా ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: