నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు చేసే సినిమా ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో బాలయ్య అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అతడి సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. అయితే బాలయ్య అప్పుడప్పుడు తన అభిమానులను కొడుతుంటారు. తమ అభిమాన హీరో కొడుతూ అయినా తమను తాకాడని అభిమానలు ఎంతో ఆనందపడుతుంటారు.

 అయితే కొందరు నటీనటుల మాత్రం ముందుగా బాలయ్య గురించి కొందరు చెప్పే మాటలు విని బాలయ్య ముక్కోపని అనుకుంటారు. కానీ అతడితో కలిసి నటించిన తరువాత బాలయ్య చాలా మంచివాడని, చిన్న పిల్లాడి మనస్తత్వం అని అంటారు. తాజాగా ఈ జాబితోలో మరో హీరోయిన్ కూడా చేరింది. అయితే ప్రస్తుతం బాలయ్య తన తాజా సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అఖండ పేరును ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.

 ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిజానికి ఈ నెల 28న విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా  ప్రగ్యా నందమూరి నటసింహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నందమూరి బాలకృష్ణ గారు తాను ఊహించుకున్నట్లు లేరని, తన ఊహలకు రియాలిటీకీ చాలా తేడా ఉందని ఆమె చెప్పింది. బాలయ్య గారు తన అభిమానులను కొట్టారని చాలా సార్లు విన్నాను, దాంతో బాలయ్యతో సినిమా అనేసరికి ముందు బయపడ్డాను.

 కానీ తీరా సినిమా చిత్రీకరణలో చూస్తే బాలకృష్ణ గారు చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. షూటింగ్‌లో ఎప్పుడూ చిల్‌గా ఉంటాడు. ఎప్పుడు జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారని ప్రగ్యా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సినిమా చిత్రీకరణ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: