యంక‌ర్ గా కెరీర్ ను మొద‌లుపెట్టిన అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిగా రానిస్తోంది. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మ‌రోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాలతో జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ త‌న టాలెంట్ ను నిరూపించుకుంది. అంతే కాకుండా ఎన్నో సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ కు స్టెప్పులేసి కుర్ర‌ళ్ల మ‌తిపోగొట్టింది. ఇక అనసూయ లీడ్ రోల్ చేసిన థాంక్యూ బ్ర‌దర్ సినిమా ఇటీవ‌ల విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అంతే కాకుండా ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ఫ సినిమాలో కీల‌క పాత్రంలో నటిస్తోంది. మ‌రోవైపు ర‌వితేజ ఖిలాడీలోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఇదిలా ఉండ‌గా తాజాగా అన‌సూయ త‌న జీవితంలోని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను భ‌య‌ట‌పెట్టింది. ముఖ్యంగా త‌న ప్రేమ విష‌యాన్ని మొద‌టిసారి భ‌య‌ట‌పెట్టింది. అనసూయ 16 ఏళ్లకే తన భర్త భరద్వాజ్ తో ప్రేమలో పడిందట. ఎన్సీసీ క్యాంప్ లో ఉన్న సమయంలో తనకు భరద్వాజ్ ప్రపోజ్ చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త‌న‌కు మొద‌టిసారి ప్ర‌పోజ్ చేసిన వ్య‌క్తి కూడా భ‌ర‌ద్వాజే అని అన‌సూయ తెలిపింది. 

అంతే కాకుండా తన భర్త కోసం ఎన్నో పూజలు ఉపవాసాలు కూడా అనసూయ చేసిన‌ట్టు తెలిపింది. త‌న త‌ల్లి ప్ర‌తిరోజూ పూజ‌లు చేసేద‌ని త‌న‌ని ఉల్లిపాయ‌లు తిన‌కూడ‌ద‌ని రూల్స్ పెట్టేద‌ని తెలిపింది. అందుకే ఇప్పుడు ఉల్లిపాయలు తెగ లాగించేస్తా అని చెప్పుకొచ్చింది. ఇక 16 ఏళ్లకు భరద్వాజ్ తో ప్రేమలో పడగా 7 ఏళ్ల తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట. తన ప్రేమ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాక‌రించార‌ని చెప్పింది. అంతే కాకుండా ఇంటి నుండి గెంటేశార‌ని చెప్పింది..దాంతో బసవతారకం ఆస్పత్రి వెనకాల ఉన్న స్లమ్ లో కొన్ని రోజులు ఒంటరిగా రూమ్ తీసుకుని ఉన్నానని తెలిపింది. సాక్షి టీవీలో పనిచేసే సమయంలో ఎన్నో కష్టాలు పడినట్టు ప‌డ్డాన‌ని... తాను ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదని ఎన్నో కష్టాలు పడినట్టు తెలిపింది. అంతే కాకుండా త‌న స్టోరీలో మంచి మ‌సాలా ఉందని డ‌బ్బులు ఉన్న‌ప్పుడు త‌న బయోపిక్ ను తానే తీసుకుంటాన‌ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: