వకీల్ సాబ్ ప్రమోషన్స్, సాగర్ చంద్ర సినిమాలో కొంత భాగం కంప్లీట్ చేయటం కోసం పవన్ తన డేట్స్ కేటాయించడంతో ఈ వీరమల్లు షూటింగ్ నిలిచిపోయిందని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయాయి. ఈ చిత్రంలో మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమాలో పవన్.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉండే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
కాగా.. పవన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పాటు నిధి అగర్వాల్ మరో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ బాలీవుడ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలను వెల్లడించింది. తాను పవన్ కల్యాణ్ సినిమా కోసం చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానని, షూటింగ్లో పాల్గొనటానికి క్రిష్ నుంచి పిలుపు ఎప్పుడొస్తుందా అనేదే తన ఆలోచన అని చెప్పింది.
ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రాణి పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా నిలుస్తుందని, అందుకే ఆమె అంత ఆత్రుతగా ఎదురు చూస్తోందని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే పవన్ సరసన హీరోయిన్గా నిధి అగర్వాల్ చేయనుందని తెలిసిపోతోంది. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో జాక్వెలిన్ నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.