టాలీవుడ్ స్టార్ నటులైన సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తొలి షెడ్యూల్ దుబాయిలో పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయి మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఓ సినిమా చేయనున్న మహేష్ ఆపై టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ దీని నిర్మించనున్నారు. మరోవైపు ప్రస్తుతం రామ్చరణ్ తో కలిసి జక్కన్న రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండగా దీనిని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవి ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇక దీని అనంతరం కొరటాల శివ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న ఎన్టీఆర్ ఆపై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ తీయనున్న ప్రతిష్ఠాత్మక సినిమాలో నటించనున్నారు. అలానే ఈ రెండు సినిమాల అనంతరం తమిళ దర్శకుడు అట్లీతో ఒక మూవీ కూడా ఎన్టీఆర్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇక అసలు విషయం ఏమిటంటే మరొక ఐదురోజుల్లో అనగా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ ఆయా పోషిస్తున్న కొమురం భీం ఫస్ట్ లుక్ పోస్టర్, అలానే కొరటాలతో ఆయన సినిమా సినిమా ప్రారంభం తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ అధికారిక అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు టాక్. అలానే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట మూవీ దుబాయ్ షెడ్యూల్ మేకింగ్ వీడియో, మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లతో పాటు త్రివిక్రమ్ మూవీ టైటిల్ ప్రకటన మరియు ప్రారంభోత్సవం జరగనున్నాయని. ఈ విధంగా అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ ఇద్దరూ కూడా తమ ఫ్యాన్స్ కి ఏకంగా ట్రిపుల్ ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. మరి ఈ వార్తలు కనుక నిజం అయితే నందమూరి, ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పకతప్పదు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: