తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకూ ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకాభిమానుల మదిలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మంచి పేరు దక్కించుకున్నాయి అని చెప్పాలి. ఆ విధంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే లవ్ స్టోరీ మూవీస్ లో మనసంతా నువ్వే కూడా ఒకటి. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాతగా వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హృద్యమైన లవ్ స్టోరీ లో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించగా రీమాసేన్ హీరోయిన్ గా నటించింది.

2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకొని హీరోగా ఉదయ్ కిరణ్ కి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. కథ విషయానికి వస్తే చిన్నప్పుడే ఒకరి పై మరొకరు ఇష్టం పెంచుకుంటారు అను, చంటి. అయితే చంటి పేదవాడు కావడం అది అను తండ్రికి నచ్చకపోవడం ఆ తరువాత అనుని ట్రాన్స్ వర్ పేరుతో వేరొక ఊరికి తీసుకువెళ్తాడు. ఆపై అను, చంటి విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరికి ఇష్టం మాత్రం మరింతగా పెరిగి ప్రేమగా మారుతుంది.

ఆ తరువాత వారిద్దరూ పెద్దయ్యాక ఏ విధంగా కలిసి తమ ప్రేమను సఫలం చేసుకున్నారు అనేది మిగతా కథ. అయితే ఈ లవ్ స్టోరీ లో పలు హృద్యమైన సన్నివేశాలు, సందర్భోచితంగా వచ్చే సాంగ్స్ ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ఇక హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా నిజాయితీగా ఒకరిపై మరొకరు ప్రేమను పెంచుకోవడం, చివరికి క్లైమాక్స్ లో ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వచ్చిన హీరో, చిన్నపుడు అను ఇచ్చిన క్లాక్ సౌండ్ కి స్పందించి బ్రతకడం వంటి సీన్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. మొత్తంగా ఈ మనసంతా నువ్వే సినిమా లవ్ లివ్స్ ఫరెవర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి ..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: