హీరోల అభిమానులు అయితే తమ హీరోకోసమే సినిమా చూస్తుంటారు. సినిమా ఎలా ఉన్నా తమ హీరో పర్ఫామెన్స్ ఎలా ఉంది. ఫైట్లు ఇరగదీసాడా..యాక్టింగ్ చింపేసాడా అని చూసి ఒకవేళ ఇరగదీయకపోయినా మన హీరోనేగా అని సైలెంట్ గా ఉంటారు. కానీ సాధారణంగా చాలామంది ప్రేక్షకులు ఒక మూడు గంటలు ఎంజాయ్ చేయాలని..ఎలాంటి బాధలు ఉన్నా మర్చిపోవాలని సినిమాకు వెళతారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం కొత్త లోకానికి తీసుకువెళ్లి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తే కొన్ని సినిమాలు మాత్రం తలనొప్పి తెప్పిస్తాయి. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ రాధే సినిమా కూడా అలాగే ఉందని టాక్. ప్రతి ఏడాది రంజామ్ కు సల్మాన్ నుండి ఓ సినిమా పక్కా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలానే ఈ ఏడాది రాధే సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇక సినిమాలో సల్లూ భాయ్ కి జోడిగా దిశా పటాని హీరోయిన్ గా నటించింది. అయితే కరోనా విజృంభణ తో థియేటర్ లు మూతపడటం వల్ల ఈ చిత్రాన్ని ఓటీటీ లో పే పర్ వ్యూ విధానంతో విడుదల చేసారు. అయితే సల్మాన్ ఖాన్ సినిమాకు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దాంతో సల్లూ భాయ్ దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది. అయితే సినిమా చూసిన తరవాత ప్రేక్షకుల బుర్రలు కూడా క్రాష్ అయిపోయాయట. 

అయితే సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ఒక వ్యూ ధర కేవలం రూ. 249 రూపాయలే నని మీకు రీసనేబుల్ ప్రైస్ లో సినిమాను అందిస్తున్నామని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇక రంజాన్ సంధర్బంగా సల్లూబాయ్ సినిమా ఎలాగైనా చూడాలని అనుకున్న ప్రేక్షకులు టికెట్ రేట్ పట్టించుకోకుండా సినిమాను చూసేశారు. అయితే సినిమా విడుదలైన నాటి నుండి ట్విట్టర్ లో అటు సల్మాన్ ఖాన్ పై ఇటు దర్శకుడు ప్రభుదేవాపై ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా అస్సలు బాగోలేదని పరమ రోటీన్ సినిమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తాజాగా టికెట్ డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. తమ వద్ద పర్ వ్యూ కు రూ.249 తీసుకున్నారని అవి వెంటనే ఇవ్వకంటూ సల్మాన్ ఖాన్ ను టాగ్ చేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. మరి సల్లూ భాయ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: