దేశంలో కరోనా విజృంభిస్తున్న . రోజూ లక్షల కేసులు, వేల మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. అందులో భాగంగానే అనేకమంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా రెండో డోసు వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన బాటలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా చేరారు.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో తన లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ ముగించుకొని ఇటీవలే చెన్నై చేరుకున్న ఆయన.. వెంటనే సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ అంటే ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనాను జయించాలంటే ఇదొక్కటే మార్గమని రజినీ చెప్పారు. అలాగే ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని సూచించారు.

ఇక రజనీలానే తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌ బీ అమితాబ్.. కూడా రెండో డోస్ వ్యాక్సిన్ పొందారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తాను కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసిన బిగ్ బీ.. ‘‘దూసరా భీ హోగయా(రెండోది కూడా పూర్తయింది).. క్రికెట్‌ది కాదు.. కోవిడ్‌ది.. సారీ.. ఇది చాలా బ్యాడ్ జోక్’’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఇప్పటికీ కొందరు భయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహ చాలా మందిలో ఉంది. ఈ అపోహను పొగొట్టేందుకు సెలబ్రిటీలు ముందుగా వ్యాక్సిన్ తీసుకుంటూ వారిలో భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: