టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. తన స్టైల్లో హీరోను ఎలివేట్ చేస్తూ.. మాస్ మసాలాలతో సినిమాను తీర్చిదిద్దడంలో పూరి దిట్ట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇటు సినిమాలు చేస్తూనే మరో వైపు వరుస పాడ్ కాస్టింగ్స్ మ్యూజింగ్స్‌తో ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాడు. అభిమానులకు బోలెడంత వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్నాడు. ఇప్పటికే ఎన్నో విషయాలపై ఆయన అద్భుతమైన స్పీచ్‌లు ఆకట్టుకున్నాయి. తాజాగా హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ గురించి పూరీ చేసిన ఓ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 ఈ పాడ్ కాస్ట్‌లో వెనిస్ నగరం గురించి కూడా పూరీ వివరించాడు. అయితే వెనిస్ నగరం గురించి వివరిస్తూనే పూరీ జగన్నాథ్ ఏంజెలీనా జోలీ బెడ్‌పై గడిపిన ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలోని డానియేలి అనే పాపులర్ హోటల్‌లో ఏంజెలినా జోలీ ఉందట. అయితే ఆమె రూమ్ ఖాళీ చేసి వెళ్లిందట. షూటింగ్ పేరుతో అబద్ధం చెప్పి ఆ హోటల్ రూమ్‌లో ఏంజెలినా ఉన్న రూంకు వెళ్లాడట పూరి. ఆమె అప్పటివరకు గడిపిన బెడ్‌పై కాసేపు కూచుని గడిపి వచ్చారట. అదోరకం సంతృప్తినిచ్చిందంటూ పూరీ చెప్పుకొచ్చాడు.

ఇక వెనిస్ గురించి చెబుతూ.. వెన్నిస్ నగరం రోజు రోజుకీ మునగిపోతుందని 2030నాటికి ఈ నగరం సగం మునిగిపోయి ఘోస్ట్ సిటీ అవుతుందని చెబుతున్నారని, అది నిజమో కాదో తెలియదని, కానీ వీలైతే వెన్నిస్‌ను అందరూ ఓసారి చూసి రావాలని పూరి సూచించారు. ``వరల్డ్ లోనే అందమైన నగరాల్లో వెన్నిస్ ఒకటి. దీన్ని వెన్నిసియా అని కూడా అంటారు. ఇటలీ నార్త్ ఈస్ట్ సిటీ.  


10బీసీలో వెన్నిస్ కట్టారు. 118 ద్వీపాలుంటాయి. వాటి మీద వెన్నిస్ సిటీని నిర్మించారు. ప్రతి ద్వీపానికి కాలువను కట్టి వాటిని కనెక్ట్ చేస్తూ 400 బ్రిడ్జిలను కట్టారు. ఈ సిటీలో కార్లు బైకులు ఉండవు. ఓ ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే గండోలా అనే అందమైన పడవ వేసుకుని వెళ్లాల్సిందే. నగరంలో అణువణువు అందంగా ఉంటాయి. దీపాలు.. బెంచీలు.. అఖరికి డస్ట్ బిన్స్ కూడా అందంగా డిజైన్ చేయబడి ఉంటాయి. గ్రాండ్ కెనాల్ నగరాన్ని విభజిస్తుంది. నగరంలో నిత్యం వాయిద్యాలు వినిపిస్తాయని’ పూరీ వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: