నట సింహా నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో " అఖండ " మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్  విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మే 28న విడుదల చెయ్యనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికి కరోనా కారణంగా మూవీ వాయిదా పడే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా తరువాత బాలయ్య, గోపిచంద్ మలినేని తో ఓ సినిమా చెయ్యనున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల వచ్చిన " క్రాక్ " మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.

 అదేమిటంటే ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో డా. రాజశేఖర్ విలన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో విలన్ పాత్ర చాలా బలంగా ఉందనుందట. అందుకోసం హీరోయిజంలో ఆవేశాన్ని ఓ రేంజ్ లో పండించే రాజశేఖర్ అయితే ఆ పాత్రకు బాగుంటుందని డైరెక్టర్ గోపిచంద్ మలినేని బావిస్తున్నాడట. దాంతో ఇప్పటికే రాజశేఖర్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక రాజశేఖర్ కూడా విలన్ పాత్రలు చేస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రాజశేఖర్ ఓకే అయితే మాత్రం బాలయ్య , రాజశేఖర్ మద్య వార్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం. మరి ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: