మరోవైపు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి ఆ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఇటీవల ప్రభాస్ తో తీసిన బాహుబలి రెండు సినిమాల గొప్ప విజయాలతో దర్శకుడిగా విశ్వవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఎప్పటినుండో రాజమౌళి, శంకర్ లలో ఎవరు గొప్ప విషయమై పలు సినిమా వర్గాల్లో, ఆడియన్స్ లో ఒక చర్చ జరుగుతోంది.
అయితే భారీ స్థాయిలో సినిమాలను తీసి దానికి మెసేజ్ తో పాటు గ్రాండియర్ గా టెక్నీకల్ హంగులు అద్దడంలో శంకర్ దిట్ట, అలానే హీరోయిజాన్ని పీక్స్ లో చూపించడంతో పాటు అంతకుమించే స్థాయిలో విలన్ ని కూడా చూపిస్తూ యాక్షన్, ఎమోషనల్ హంగులను సమపాళ్లలో చూపిస్తూ సినిమాలు తీయగల దిట్ట రాజమౌళి. వీరిద్దరి మధ్యన తేడా ఏంటంటే శంకర్ ది సినిమా యొక్క టెక్నీకల్ నాలెడ్జి కలిగిన టాలెంట్ అయితే రాజమౌళి ది యాక్షన్, ఎమోషన్ మీద పట్టు అని అంటున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పాలంటే ఇద్దరూ అని చెప్పవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ ఇద్దరు దర్శకులు కూడా భారతీయ సినిమా ఖ్యాతిని తమ టాలెంట్ తో ఉన్నతస్థాయికి తీసుకెళ్లారని, రాబోయే రోజుల్లో వీరు తీయబోయే సినిమాలు మరింత గొప్ప విజయాలు అందుకుని దూసుకెళ్లడం ఖాయం అని వారు అంటున్నారు..... !!