అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులు నుండి భారీ స్పందన రాబట్టింది. ఈ మూవీ ని ఆగష్టు 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు. ఇక అసలు విషయం ఏమిటంటే, పుష్ప కథ చాలా భారీ స్కోప్ ఉన్న సినిమా అని, అందువలన ఈ మూవీ ని రెండు భాగాలుగా తీయదల్చినట్లు చెప్పారు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్.
ఈ విషయమై దర్శకడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఇద్దరూ పక్కాగా ప్లానింగ్ తో ఉన్నారని ఆయన అన్నారు. అయితే ముఖ్యంగా ఈ సినిమా రెండు భాగాలుగా తీయడానికి కారణం, ఈ స్టోరీలో పలు ఊహించని మలుపులు, ట్విస్టులు ఉన్నాయని, అలానే పలు కీలక సన్నివేశాల్లో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయం అని, ఇటువంటి మూవీని రెండు భాగాలుగా తీస్తే ఆడియన్స్ కి మరింతగా రీచ్ అవుతుందని యూనిట్ మొత్తం భావిస్తోందట. తప్పకుండా మొదటి భాగం సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని, అయితే రెండవ భాగం మొదటి దానిని మించేలా మరింత సూపర్ హిట్ అవుతుందని ఇన్నర్ వర్గాల టాక్. మరి ఇదే కనుక నిజం అయితే ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గొప్ప పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు .... !!