అక్కినేని ఎన్టీఆర్ లు తరువాత ఇండస్ట్రీని గత 4 దశాబ్దాలుగా శాసిస్తున్నది చిరంజీవి అన్నది కాదనలేని నిజం. రాజకీయాల బాటపట్టి 9 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా రాజకీయాలలో పెద్దగా సక్సస్ సాధించలేకపోయినా ఈ విషయాలు ఏమి చిరంజీవి క్రేజ్ ను ఒక్క శాతం కూడ తగ్గించలేకపోయాయి. 66 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఇప్పటికీ చిరంజీవి నటిస్తే చాలు అంటూ అతడి చుట్టూ ప్రముఖ దర్శకులు నిర్మాతలు తిరుగుతూనే ఉన్నారు.


ఇలాంటి ఇమేజ్ మరో తెలుగు హీరోకు ఎప్పుడు వస్తుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఈనేపధ్యంలో ఒకనాటి జేమ్స్ బాండ్ సినిమాల దర్శకుడు కె.ఎస్.ఆర్ దాస్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ చిరంజీవి వీపు పై ఉన్న ఒక పెద్ద పుట్టుమచ్చ గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఒకప్పుడు ఆంధ్రా జేమ్స్ బాండ్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ తో ఈయన అనేక సినిమాలు తీసాడు. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఆ రోజులలో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.


ప్రస్తుతం సినిమాలు లేక దీనికితోడు వయసు కూడ పై పడటంతో కె.ఎస్.ఆర్ దాస్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. చిరంజీవి చిన్న హీరోగా కొనసాగుతున్న అలనాటి రోజులలో ఈ దర్శకుడు చిరంజీవి మోహన్ బాబు లతో కలిపి ‘బిల్లా రంగా’ అనే మూవీ తీసాడు. ఈమూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక పాట చిత్రీకరణ కోసం చిరంజీవి డ్రస్ చేంజ్ చేస్తున్నప్పుడు కె.ఎస్.ఆర్. దాస్ చిరంజీవి వీపు పై ఉన్న ఆ పెద్ద పుట్టుమచ్చ చూసాడట.


అలాంటి పుట్టుమచ్చ ఒక్క నందమూరి తారకరామారావు కు మాత్రమే ఉందని అందువల్ల చిరంజీవి కూడ ఎదో ఒకనాటికి ఇండస్ట్రీలో టాప్ హీరో అవుతాడు అంటూ ఆరోజుల్లోనే జోస్యం చెప్పాడట. అయితే చిరంజీవి సినిమాలలో ఎన్టీఆర్ స్థానాన్ని అందుకున్నాడు కానీ రాజకీయాలలో ఆయన లా చరిత్ర సృష్టించ లేకపోయాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: