మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ మధ్య స్నేహం ఈనాటిది కాదు. త్రివిక్రమ్ సునీల్ లు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ భాగ్యనగరంలోని కృష్ణానగర్ లో ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటూ ఉండేవారు. ఆతరువాత త్రివిక్రమ్ మాటల రచయితగా దర్శకుడుగా సునీల్ కమెడియన్ గా టాప్ స్థానంలోకి చేరుకున్నప్పటికీ వీరి స్నేహం ఇప్పటికీ ఎంతో ఘాడంగా కొనసాగుతూనే ఉంది.


కమెడియన్ గా టాప్ స్థానంలో ఉన్న సునీల్ తన రూట్ మార్చి హీరోగా మారినప్పటి నుంచి అతడికి కెరియర్ పరంగా సమస్యలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ మూవీల ద్వారా తనకు కెరియర్ పరంగా బ్రేక్ కోసం త్రివిక్రమ్ ద్వారా తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠ పురములో’ మూవీలలో త్రివిక్రమ్ సునీల్ కు ఒక పాత్రను క్రియేట్ చేసినా ఆపాత్రలు త్రివిక్రమ్ కు ఏమాత్రం పేరును తెచ్చిపెట్టలేదు.


దీనితో త్రివిక్రమ్ ఈసారి తన మేధస్సుకు పదును పెట్టి మహేష్ తో త్వరలో ప్రారంభించబోతున్న మూవీలో సునీల్ కు ఒక కీలక పాత్రను త్రివిక్రమ్ క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈపాత్ర హీరో మహేష్ పాత్రతో కలిసి ట్రావెల్ చేసే పాత్ర అని కథలో ప్రాముఖ్యత కలిగి ఉన్న క్యారెక్టర్ గా ఈపాత్రను త్రివిక్రమ్ చాల శ్రద్ధతో డిజైన్ చేసాడు అని వార్తలు వస్తున్నాయి.


మహేష్ కూడ సునీల్ పాత్ర విషయమై త్రివిక్రమ్ సూచనలకు అంగీకరించడంతో ఇప్పుడు ఈమూవీ ప్రాజెక్ట్ లో సునీల్ ఎంపిక ఖాయం అని అంటున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ ఈమధ్య తాను తీసిన రెండు సినిమాలలో సునీల్ కు అవకాశాలు ఇచ్చినప్పటికీ అవి ఏమీ సునీల్ కు గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ చేస్తున్న ఈ సహాయంతో అయినా తన కెరియర్ గాడిలో పడుతుందని సునీల్ భావిస్తున్నాడు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు ఈమూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: