రంగస్థలం సినిమా తర్వాత వస్తున్న వినయ విదేయ రామ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం తో ఓ పక్క దర్శక నిర్మాతలతో టెన్షన్ తో పాటు, గర్వం కూడా ఉంది.. బోయపాటి శీను మాస్ ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు.. ఈ నేపథ్యంలో మెగా హీరోయిన్ రామ్ చరణ్ తేజ్ తో సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకున్నారు మెగా అభిమానులు.. దానికి తగ్గట్లే ఈ సినిమాలో ఆలనాటి హీరో ప్రశాంత్ ని కూడా తీసుకువచ్చి మంచి ప్రయోగం చేశారు..
అంత సెట్ అయింది ఇక సూపర్ హిట్ కొట్టడమే తరువాయి అనుకున్నారు మెగా అభిమానులు.. పాటలతో ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు.. సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది.. బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ ను విలన్ గా తీసుకొచ్చిన కూడా అ సినిమా ఏ మాత్రం సక్సెస్ అవ్వలేదు.. ఫలితంగా హీరోకి అటు దర్శకుడికి పెద్ద గుణపాఠం మిగిలిపోయింది.. సినిమాలో మాస్ విపరీతంగా ఎక్కువై పోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు..నిజం గా మెగా అభిమానులకు ఈ సినిమా ఓ పీడకలగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ తేజ్..