రామ్ చరణ్ తేజ నటించిన సినిమాలో అత్యంత దారుణంగా ఫ్లాప్ అయిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.. అందులో ఒకటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ.. తన కెరీర్ ఆరంభంలో ఆరెంజ్ సినిమాతో భారీ ఫ్లాపును ఎదుర్కొన్న రామ్ చరణ్ మళ్లీ చాలా సినిమాల తర్వాత అంతటి భారీ ఫ్లాప్ ని ఈ సినిమా ద్వారా ఎదుర్కొన్నాడు.. అప్పటికే తన కెరీర్ బెస్ట్ సినిమా అయిన రంగస్థలం సినిమా చేసి సూపర్ హిట్ జోష్ లో ఉన్నాడు రామ్ చరణ్..దాంతో ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేసినా సూపర్ హిట్ అయ్యేది కానీ వినయవిదేయ రామ మాత్రం ఫ్లాప్ గా మిగిలింది..

రంగస్థలం సినిమా తర్వాత వస్తున్న వినయ విదేయ రామ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం తో ఓ పక్క దర్శక నిర్మాతలతో టెన్షన్ తో పాటు, గర్వం కూడా ఉంది.. బోయపాటి శీను మాస్ ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు.. ఈ నేపథ్యంలో మెగా హీరోయిన్ రామ్ చరణ్ తేజ్ తో సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకున్నారు మెగా అభిమానులు.. దానికి  తగ్గట్లే ఈ సినిమాలో ఆలనాటి హీరో ప్రశాంత్ ని కూడా తీసుకువచ్చి మంచి ప్రయోగం చేశారు..

అంత సెట్ అయింది ఇక సూపర్ హిట్ కొట్టడమే తరువాయి అనుకున్నారు మెగా అభిమానులు.. పాటలతో ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు.. సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది.. బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ ను విలన్ గా తీసుకొచ్చిన కూడా అ సినిమా ఏ మాత్రం సక్సెస్ అవ్వలేదు.. ఫలితంగా హీరోకి అటు దర్శకుడికి పెద్ద గుణపాఠం మిగిలిపోయింది.. సినిమాలో మాస్ విపరీతంగా ఎక్కువై పోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు..నిజం గా మెగా అభిమానులకు ఈ సినిమా ఓ పీడకలగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ తేజ్..


మరింత సమాచారం తెలుసుకోండి: