దర్శకుడు తేజ చిన్న సినిమాలతో లైన్ లోకి వచ్చి ప్రస్తుతం పెద్ద సినిమాలు చేస్తూ వెరైటీ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. రాంగోపాల్ వర్మ శిష్యుడు గా మెగాఫోన్ పట్టుకున్న దర్శకుడు తేజ అచ్చం వర్మ స్టైల్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తేజ అప్పటికే చాలా పెద్ద పెద్ద సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించి ఉన్నారు.. అయితే తనకు మెగాఫోన్ పట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో గానీ తొలి 'చిత్రం' తోనే సూపర్ హిట్ కొట్టి దర్శకుడుగా సెటిల్ అయిపోయారు..

ఆ తర్వాత ఆయన చేసిన సినిమా లు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. నువ్వు నేను, జయం, నిజం, ధైర్యం వంటి సినిమాలు ఆయన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.. ప్రేమకథా చిత్రాలను ఇలా కూడా చేయొచ్చు అన్న కొత్త అర్థాన్ని చూపించాడు దర్శకుడు తేజ.. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసి తన కెరీర్ నాశనం చేసుకున్నాడు తేజ.. మళ్లీ రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తో ట్రాక్ లోకి వచ్చాడు..

ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేయగా ఇటీవలే ఆ చిత్రం యొక్క అనౌన్స్ మెంట్ కూడా అయింది.. కాగా ఇటీవలే ఆయన ఉదయ్ కిరణ్ తో దిగిన ఓ ఫోటో రియల్ గా మారింది.. ఈ ఫోటోలోనే ఇప్పటి స్టార్ హీరో అయిన నితిన్ కూడా ఉండడం విశేషం.. దర్శకుడు తేజ దర్శకత్వంలో ఇద్దరు హీరోలు టాలీవుడ్ కి పరిచయమై స్టార్ హీరోలుగా ఎదిగారు.. కానీ దురదృష్టవశాత్తూ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. ఈ ఫోటోలో కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా చూడొచ్చు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా మిస్సింగ్ యూ ఉదయ్ కిరణ్ అనే కామెంట్లు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: