కోవిడ్ ప్రభావంలో కూడా వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేసిన నాగార్జున మొన్నీమధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినా థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు రాలేదు అనుకోండి, ఇక ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ప్రస్తుతం నాగార్జున తన లేటెస్ట్ మూవీని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం నాగార్జున చాలానే కష్టపడుతున్నాడట.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో స్పెషల్ సెట్ను వేశారు. అంతకు ముందు గోవాలో సినిమా షూటింగ్ చేసి వచ్చిన నాగార్జున ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఇక్కడే అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో చేయనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున సినిమా షూట్ జూన్ మొదటి వారంలో తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించారు. అయితే దానికి కేవలం రెండు వారాల సమయం ఉంది. ఈ సినిమాలో నాగార్జున రిటైర్డ్ రా ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎక్కువ గ్యాప్ తీసుకుకోకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసే పనిలో నాగ్ ఉన్నాడని అంటున్నారు.
అందుకే ఆయన వయసు అరవై దాటినా ఆయన కరోనా గురించి పెద్దగా ఆలోచించడం లేదని అంటున్నారు. నిజానికి ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే మిగతా యూనిట్ కూడా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. వాళ్ళు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారని చెప్పలేం. అలా ఒకరంగా కరోనా టెన్షన్ రేకెత్తిస్తున్నా నాగ్ మాత్రం షూట్ లో పాల్గొనక తప్పదని అంటున్నాడట. మరి చూడాలి ఏమవుతుందో. ఇక చివరిగా ప్రవీణ్ సత్తారు చేసిన వెబ్ సిరీస్ 11th హవర్ మిశ్రమ స్పందన పొందింది. ఆయన ఇప్పుడు నాగ్తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.