ఛార్మి కౌర్.. అలనాటి నుండి నేటి వరకు వయసు పెరుగుతున్నకొద్దీ వన్నె తరగని అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఈమె సినీ ఇండస్ట్రీలో హీరోయిన్  మాత్రమే  కాదు నిర్మాతగా కూడా సినీ ఇండస్ట్రీలో ఛలామణి అవుతోంది. ముఖ్యంగా ఏదైనా సినిమాలో ఛార్మి నటిస్తోంది అంటే చాలు కేవలం ఈమె కోసమే కుర్రకారు థియేటర్ల తో నిండి పోయేవారు. అంతలా ఈమె నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. అయితే ఇంతలా స్టార్డంను సంపాదించుకున్న ఛార్మి తనకు ఇష్టం లేకున్నా కూడా కేవలం వారి కోసమే సినీ ఇండస్ట్రీలో కి వచ్చాను అని అంటోంది. అయితే వారు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఛార్మి మే 17 1986 న పంజాబ్ లో జన్మించింది. అయితే  ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. తన స్వస్థలం ముంబాయిలో  అనుకోకుండా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి, ఆమె తల్లిదండ్రులను సంప్రదించి "నీతోడు కావాలి " అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది. ఇక అయితే ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది. అలా తల్లిదండ్రుల మాట కాదనలేక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఛార్మి కౌర్..


కానీ ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ఛార్మికి వెంటనే " కాదల్ కిసు కిసు " అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు వంటి తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె తెలుగు దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం కూడా పరాజయం పాలైంది. ఆ తర్వాత దాని  నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ , ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా  ఎదిగింది.

2007 డిసెంబరులో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. ఇక ఈ చిత్రానికి గాను నంది విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈమె నిర్మాతగా కూడా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: