ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తికాక ముందే నాగ్ అశ్విన్‌తో ఓ పాన్ వరల్డ్ సినిమాను ప్రకటించాడు. అలాగే, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్' అనే సినిమాను మాత్రం ప్రారంభించేశాడు. దీనితో పాటు ఓ బాలీవుడ్‌ చిత్రంలోనూ చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ప్రభాస్ బాలీవుడ్‌లోని అడుగు పెడుతోన్న చిత్రమే ‘ఆదిపురుష్'. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వస్తుంది. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘ఆదిపురుష్' సినిమా రామాయణం నాటి కథతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇది చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగానూ బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు.

సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ‘ఆదిపురుష్' మూవీ షూటింగ్ ముంబై నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రారంభించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆదిపురుష్' సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. రామాయణం అంటే చాలా పాత్రలు ఉంటాయి కాబట్టి పేరున్న వాళ్లనే తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్‌ను తీసుకున్నారని ఓ న్యూస్ లీకైంది. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ విజేత, ప్రముఖ నటుడు సిద్దార్థ్ శుక్లా ‘ఆదిపురుష్'లో కీలక పాత్రను పోషిస్తున్నాడట. కాసేపే కనిపించే మేఘనాథుడి పాత్రలోనే అతడు నటిస్తున్నాడని తెలిసింది. కొన్ని డబ్బింగ్ సీరియళ్ల ద్వారా అతడు దక్షిణాది మొత్తానికి పరిచయం అయ్యాడు. అందుకే అతడిని ఈ సినిమాలో భాగం చేయాలని దర్శకుడు భావించి ఈ పాత్రకు ఎంపిక చేశాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: