నాగార్జున కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రం భాయ్... వీరభద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక్క షో కూడా సరిగా ఆడలేదు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. కనీసం నాగార్జున కు ఉన్న క్రేజ్ కి మొదటి షో అయిన హౌస్ ఫుల్ అవుతుందేమో అని అనుకున్నారు కానీ ఈ సినిమాకి ఆ అదృష్టం దక్కలేదు.. నాగార్జున కెరీర్లో ఎప్పటికీ ఈ చిత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచి పోతుంది అని అక్కినేని అభిమానులు అంటున్నారు.. నాగార్జున కూడా ఈ సినిమా ఒక పెద్ద పీడకలగా అభివర్ణిస్తూ ఉంటారు.

దర్శకుడు వీరభద్రం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నాగార్జునసినిమా చేయగా ఆ సినిమాని గాలికి వదిలేశారని ఆ చిత్రం రిలీజ్ అయిన సందర్భంలో నాగార్జున బహిరంగంగా అన్నారు.. ఇన్నేళ్ల కెరీర్ లో ఈ సినిమా చేసి పెద్ద తప్పు చేశానని నాగార్జున బాధపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తో పాటు రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించిన సినిమా వల్ల ఎవరికి నయ పైసా ఉపయోగం లేదు అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.. తెలుగు సినిమా చరిత్ర గుర్తుంచుకునే ఫ్లాప్ లలో గుర్తుంచుకునే సినిమా కూడా ఒకటి అవుతుంది..

అప్పటికే వరుస హిట్లతో మంచి దూకుడు మీదున్న నాగార్జున ఈ సినిమాతో ఒక్కసారిగా డీలా పడిపోయారు అని చెప్పాలి.. కథను ఒకలా చెప్పి తీయడంలో మరో కథను చూపించాడట దర్శకుడు.. నాగార్జున ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన కథ అయినా కేవలం నాగార్జున మీద మాత్రమే దృష్టి పెట్టి, కథ పై దృష్టి పెట్టకపోవడంతో ఈ సినిమా ఫలితం ఇలా వచ్చిందని అప్పట్లో చర్చించుకున్నారు.. అందుకే 2013వ సంవత్సరం నాగార్జునకు అత్యంత బాధాకరమైన సంవత్సరంగా ఆయన సన్నిహితుల వద్ద గుర్తు చేసుకుంటారు.. దీన్ని నాగార్జున రిలయన్స్ వారితో కలిసి నిర్మించడంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.. అందుకే ఈ సినిమాని గుర్తు చేసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడరు నాగార్జున..

మరింత సమాచారం తెలుసుకోండి: