మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో " ఆర్.ఆర్.ఆర్ " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తోపాటు, జూ. ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యే సమయంలో కరోనా మళ్ళీ విజృంబించడంతో చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఇక చరణ్ " ఆర్.ఆర్.ఆర్ " తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో " ఆచార్య " మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే చరణ్ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది.

ఇక ఆ తరువాతి సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెయ్యనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే పలు రకాల అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ ను పలు రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న "బారతీయుడు 2 " మూవీ ని పూర్తి చేయకుండా రామ్ చరణ్ తో సినిమా చేస్తే కోర్టు ను ఆశ్రయిస్తాం అంటూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ " లైకా ప్రొడక్షన్స్ " యజమాన్యం హెచ్చరించింది. దీంతో రామ్ చరణ్ మూవీ పై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ శంకర్ " బారతీయుడు 2 " పూర్తి చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

దీంతో చరణ్ ప్లాన్ మార్చి మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎప్పటినుంచో గౌతమ్ తిన్ననూరి చరణ్ కాంబినేషన్ లో సినిమాపై వార్తలు వస్తూనే ఉన్నాయి. శంకర్ మూవీ వాయిదా పడితే ఈ ప్రాజెక్ట్ పట్టాలేక్కే అవకాశం లేకపోలేదు. ఇక మరో తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు కూడా చెర్రీ డైరెక్టర్స్ లిస్ట్ లో బాగానే వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి చరణ్- శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు ఎదురవుతున్న సమస్యలు కాస్త నిరాశ కలిగిస్తున్నాయనే చెప్పాలి. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: