మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ న‌టించిన ఆరెంజ్ చిత్రం భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది.అయితే ఆ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ బాక్సాఫీసు వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ అయింది.రాంచ‌ర‌ణ్ న‌టించిన మూడ‌వ సినిమా కావ‌డంతో మెగా అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.పైగా ఈ సినిమాకి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.2010లో రిలీజ్ అయిన ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిరోయిన్‌గా  జెనీలియా న‌టించింది.
సినిమా కంటే ముందు రాంచ‌ర‌ణ్ చిరుత‌, మ‌గ‌ధీర సినిమాలు తీసి మంచి క్రేజ్ లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచాలు వ‌చ్చాయి. కానీ ఈ సినిమా అట్ట‌ర్ ప్లాప్ కావ‌డంతో నిర్మాత నాగ‌బాబు ఆర్థికంగా న‌ష్ట‌పోయాడు.ఈ సినిమాకి రాంచ‌రణ్ తీసుక‌న్న రెమ్యూనిరేష‌న్‌ని పూర్తిగా నాగ‌బాబుకి తిరిగి ఇచ్చేశాడు రాంచ‌ర‌ణ్. ఆ త‌రువాత నాగబాబు ఆర్థికంగా కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌ట్టింద‌ని ప్ర‌చారం జ‌రిగింది.ఆరెంజ్ త‌రువాత పెద్ద ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎవ‌రూ త‌న‌తో సినిమాలు చేసేందుకు ముందుకు రాలేద‌ని చ‌ర‌ణ్ ఓ ఇంట‌ర్వూలో తెలిపారు.ఆరెంజ్ సినిమా తీసిన రెండెళ్ల త‌రువాత సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ర‌చ్చ సినిమా చేశాడు.మెగాస్టార్ కుమారుడిగా ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మైన రాంచ‌ర‌ణ్ హ్యాట్రిక్ సాధించాల‌ని త‌ప‌న ప‌డ్డాడు.ఆరెంజ్ సినిమాతో హాట్రిక్ సాధింస్తాడ‌ని భావించిన‌ప్ప‌టికి అదికాస్త అట్ట‌ర్‌ప్లాప్‌గా మార‌డంతో ఆయ‌న హ్యాట్రిక్‌కు బ్రేక్ ప‌డింది.
మ‌రోవైపు ఈ సినిమా నిర్మాత నాగ‌బాబుకు ఆయ‌న సోద‌రుడు చిరంజీవి సాయం అందించాడు.ఇదే విష‌యాన్నిఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖ‌తాలో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్నకు స‌మాధానం తెలిపారు. ఈ సినిమా వ‌ల్ల తాను చాలా న‌ష్ట‌పోయాన‌ని....ఆ అప్పుల‌ను స‌గం చిరంజీవి తీర్చార‌ని వివ‌రించారు. అంతేకాకుండా రాంచ‌ర‌ణ్ ఈ సినిమాకు రెమ్యూనిరేష‌న్ తీసుకోలేద‌ని..భ‌విష్య‌త్‌లో  రాంచ‌ర‌ణ్‌కి ఇవ్వాల్సిన రెమ్యూనిరేష‌న్ కూడా తిరిగి ఇస్తాన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.ఎదిఎమైన‌ప్ప‌టికీ భారీ అంచానాల‌తో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా ఇటు మెగా అభిమానుల‌కు నిరాశ క‌లింగించింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: