తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి అటు హీరోగా  సినిమాలు చేస్తూనే ఇటు విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ మాస్టర్,  ఉప్పెన సినిమాల్లో సేతుపతి విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు  సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. ఆయనతో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు.కానీ ఆయనకి మాత్రం మొదటినుంచి బాలీవుడ్ సరిగ్గా కలిసిరావట్లేదు. ఇంతకుముందు విజయ్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ సినిమాలో చేయాల్సిన పాత్ర వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది.

ఇక ఇప్పుడు కొత్తగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో విజయ్ మెయిన్ లీడ్ గా చేస్తున్నారు . ఈ సినిమాకి ‘మేరీ క్రిస్మస్’ అనే పేరుని ఫిక్స్ చేశారు.‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గోవా’లో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకున్నారు. అయితే ఇటీవల కత్రినా కైఫ్ కరోనా భారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.ఇలా ఆయన బాలీవుడ్ లో చేస్తున్న ప్రతి సినిమాకి ఇలా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.

ఇక ఈ సినిమాకి  కాస్త గ్యాప్ తీసుకొని వచ్చే నెలలో ‘గోవా’లో షూటింగు మొదలుపెడతారని టాక్. కత్రినా , విజయ్ సేతుపతి కాంబినేషన్లోని కొన్ని సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తారట. కరోనా నిబంధనలను అనుసరిస్తూ .. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తుంది. ఇక పాత్ర పరమైన ప్రయోగాలు చేయాలనుకునే దర్శకులు విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకునే, ఆ పాత్రలను డిజైన్ చేసుకుంటున్నారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా, ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మరి ఈ విలక్షణ నటుడు బాలీవుడ్ లో ఎలా  రాణిస్తాడో చూడాలి.ఆయనకి ఇతర భాషల్లో కూడా అభిమానులు మెల్లగా పెరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: