మెగాస్టార్ ఈ మధ్య యంగ్ హీరోల కన్నా వేగంగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆచార్య దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారని టాక్ రాగా అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మోహన్ రాజా గతంలో చాలా రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో హనుమాన్ జంక్షన్‌ను డైరెక్ట్ చేసింది ఇతనే.

 ఆ తర్వాత తమిళ్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేందుకు రామ్ చరణ్ ధృవ ఒరిజనల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసింది మోహన్ రాజానే. ఇక అది అలా ఉంచుతే ఈ సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఒరిజినల్ సినిమాలో అసలు హీరోయిన్ ఉండదు కానీ మెగాస్టార్ ఇమేజ్ కోసం ఆయన హీరోయిన్ ని పెట్టాలి అనుకుంటున్నారట. పైగా హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు రాగా.. అయితే హీరోయిన్ పాత్ర నిడివి తక్కువ అని, జస్ట్ గెస్ట్ రోల్ లాంటిది అని, అందుకే ఆ పాత్రలో అనుష్క అయితే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట.

అయితే ఇలా ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ లేకుండా రీమేక్ లో హీరోయిన్ ని పెట్టి పవన్ కళ్యాణ్ ఈ మద్యనే వకీల్ సాబ్ సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆ హీరోయిన్ పాత్ర సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు ఇలాంటి తప్పు మళ్ళీ మెగాస్టార్ కూడా చేస్తున్నారా అని అనే అనుమానం వస్తుంది.అయితే ఒకవేళ హీరోయిన్ ని పెట్టిన చిరు క్రేజ్ ముందు ఆమె అసలు కనిపించదు అని టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: