ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. సినిమా ఎలా వున్న మహేష్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఎక్కువ మాస్ సినిమాలు చెయ్యకపోయిన కేవలం రెండే రెండు మాస్ సినిమాలతో పెద్ద స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలో కూడా మహేష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక మహేష్ చేసిన డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. ఎందుకంటే మహేష్ ఫ్యాన్స్ కి అతడు, ఖలేజా లాంటి మెమోరబుల్ హిట్స్ ఇచ్చాడు. ఆ రెండు రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అభిమానిని ఎంతగానో ఆకట్టుకున్నాయనే చెప్పాలి.ముఖ్యంగా ఈ రెండు సినిమాలు టీవిల్లో సరికొత్త రికార్డులను సృష్టించాయి.ఇక ఇప్పటికి కూడా రికార్డు స్థాయిలో టీ ఆర్ పి రేటింగ్స్ ని నమోదు చేస్తున్నాయి.


ఇక ఖలేజా తరువాత వీరి కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు వీరిద్దరి కాంబో షురూ అవ్వడం జరిగింది. అయితే ఎలాంటి కథతో రాబోతున్నారు అనే దానిపై ఫ్యాన్స్ లో తీవ్రమైన చర్చ నడుస్తుంది.ఇక ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్ ని ఒక కలెక్టర్ గా చూపించబోతున్నాడట. ఒక భూమి గొడవ విషయంలో ఒక మంత్రిని ఎదిరించే కలెక్టర్ గా మహేష్ పాత్రని త్రివిక్రమ్ తన స్టైల్ లో చెక్కబోతున్నాడట.అయితే ఈ పాత్ర కూడా డిఫరెంట్ రోల్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ షాక్ తిన్నా కాని ఇప్పుడు కూసింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట.ఇక మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: