టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రొటీన్ కి కాస్త భిన్నంగా సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుని దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కె. కుమార్.మిగతాదర్శకులతో పోలిస్తే ఈయన సినిమాలు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతుంటాయి.అలా ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సినిమాయే 'గ్యాంగ్ లీడర్'..న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమాతో ప్రియాంకా మోహన్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు దర్శకుడు విక్రమ్.గ్యాంగ్ లీడర్ కథ అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతో ఈ సినిమా చేసారట.

కానీ సినిమా విడుదలయ్యాక ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.సినిమాలో కంటెంట్ బాగుండి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. కమర్షియల్ గా మాత్రంవిజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ఇదే విషయమై తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ విక్రమ్ మాట్లాడుతూ.."ఈ కథపై ఎంతో నమ్మకంగా ఉన్నాం.నా భార్య నేను తీసే ప్రతీ సినిమాకు విమర్శకురాలిగా ఉంటూ వచ్చేది.ఆమెకి గ్యాంగ్ లీడర్ సినిమా కథను చెప్పగానే చాలా మంచి కథ అంటూ అభినందించింది.నా భార్య ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ తో ఈ కథపై నాకు ఇంకా నమ్మకం పెరిగింది.కానీ సినిమా విడుదలయ్యాక నేను అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందనేబాధ ఇప్పటికే నాలో ఉంది.

అయితే తెలుగులో ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా..ఈ సినిమాని హిందీ తో పాటూ తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తుండటం చాలా సంతోషాన్ని కలిగించింది.మన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం ఎంతో గౌరవం.ఆ విషయంలో మాత్రం నాకు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా సంతృప్తినిచ్చిందని" చెప్పుకొచ్చాడు దర్శకుడు విక్రమ్. కె. కుమార్..ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు అక్కినేని హీరో నాగ చైతన్య తో "థ్యాంక్యూ" అనే సినిమా చేస్తున్నాడు.రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.అంతేకాదు సినిమాలో చైతు..మహేష్ బాబు కి వీరాభిమాని గా కనిపించనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: