టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా అఖండ పై అందరిలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ని బోయపాటి శ్రీను తీస్తుండగా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రాబోయే దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గ్రాండ్ లెవెల్లో రూపొందుతోంది.

ఇక నిన్న తన 61వ జన్మదినాన్ని వైభవంగా జరుపుకున్న బాలకృష్ణ, ఇకపై తాను కథల ఎంపిక విషయమై మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఫ్యాన్స్ ని ఆకట్టుకునే సినిమాలు చేస్తానని అన్నారు. అయితే నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఒక తెలుగు న్యూస్ ఛానల్ కి ప్రత్యేకంగా వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన బాలకృష్ణ, తనయుడు మోక్షజ్ఞ గురించి పలు వ్యాఖ్యలు చేసారు. త్వరలో తాను దర్శకత్వం వహించబోయే టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 999లో తనతో కలిసి మోక్షజ్ఞ కూడా నటించనున్నాడని, ఇద్దరివీ సినిమాలో సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలు అని అన్నారు బాలకృష్ణ. దానితో బాలకృష్ణ, మోక్షజ్ఞ కాంబోలో సినిమా వస్తుందనే విషయం తేటతెల్లం అయింది.

కానీ ఆదిత్య 999 మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అవుతుందా లేదా అనే విషయమై మాత్రం బాలకృష్ణ క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయంలో ఫ్యాన్స్ కొంత కన్ఫ్యూజన్ లో పడ్డప్పటికీ మొత్తానికి తండ్రితో కలిసి ఆదిత్య 999లో మోక్షజ్ఞ అదరగొట్టడం ఖాయం అని ఇప్పటి నుండే నందమూరి ఫ్యాన్స్ అతడి పై నమ్మకాలు పెట్టుకుంటున్నారు. మరి ఇంతకీ మోక్షజ్ఞ ఏ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు ... .!!

మరింత సమాచారం తెలుసుకోండి: