అనుష్క శెట్టి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తనదైన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసిన అమ్మడు అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. ఆ తరువాత ఈ బొమ్మాలి కోసం ప్రత్యేక కథలు రాయడం కూడా మొదలైంది. అందులో భాగంగానే భాగమతి, రుద్రమదేవి వంటి సినిమాలు కూడా తెరకెక్కాయి. కానీ అవి అనుకున్నంతగా రాణించలేక పోయాయి. కానీ ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాతో అమ్మడు మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత స్వీటీ మరో సినిమా ప్రకటించలేదు. అదే సమయంలో కరోనా రావడం లాక్‌డౌన్ విధించడంతో ఇండస్ట్రీలోని సినిమాలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం స్వీటీ చాలా బాధపడుతుందట. సినిమా అవకాశాల కోసమో, నచ్చిన కథ రాకనో కాదట. అమ్మడి బాధకు అసలు కారణం వేరే ఉందని టాక్ వస్తుంది. కరోనా లాక్‌డౌన్ రాకపోతే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని, దాని ద్వారా మళ్లీ తనేంటో నిరూపించుకోవాలని అమ్మడు ఆశపడిందట. దానికి తోడుగా ఆ సినిమా పూర్తయిన వెంటనే పెళ్లి పీటలెక్కాలని కూడా ప్లాన్ చేసుకుందట, కానీ లాక్‌డౌన్ రావడంతో తన ప్లాన్స్ అన్నీ తారుమారయ్యయని స్వీటీ బాధపడుతుందట. ఈ మేరకు సమాచారం అమ్మడి సన్నిహిత వర్గాల నుంచి అందుతోంది. అయితే ఇదివరకే అమ్మడి కోసం తల్లిదండ్రులు ఓ సంబంధం తీసుకువచ్చారని, ఆ సంబంధానికి అమ్మడు కూడా ఓకే చెప్పిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వస్తున్న వార్తలు వింటుంటే అప్పడు వచ్చిన పెళ్ళి విషయం నిజమేనేమో అన్న సందేహాలు అభిమానుల్లో వస్తున్నాయి. మరి స్వీటీ తన పెళ్లి కబురు త్వరలో ఏమైనా చెబుతుందేమో చూడాలి.



ఇదిలా ఉంటే ప్రస్తుతం అమ్మడు ఓ సినిమాను ఓకే చేసింది. అందులో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఆ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ కాలేదు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రారంభించనున్నారట. మరి ఈ సినిమా ప్రారంభ వేడుకల్లో స్వీటీ తన పెళ్లి గురించి ఏమైనా హింట్ ఇస్తుందేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: