మనందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా బిగ్ బాస్ షో వీక్షిస్తూ ఉంటారు. అయితే బిగ్బాస్ ఐదవ సీజన్ కోసం ప్రస్తుతం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలిసిందే. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు నిర్వాహకులు. అయితే గతంలో బిగ్బాస్ మూడవ సీజన్ లో బుల్లితెరపై ఎంతో గుర్తింపు సంపాదించుకొని టాప్ యాంకర్గా కొనసాగుతున్న శ్రీముఖి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో యాంకర్ కూడా ఇలా ప్రేక్షకులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇటీవలే స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పంపేందుకు జబర్దస్త్ యాంకర్ రష్మీ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అటు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారట. దీంతో రష్మీ బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కానీ అటు మల్లెమాల యాజమాన్యం మాత్రం రష్మీ బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదట. ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ లో రష్మీ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ రక్తి కట్టిస్తున్నారు.. అందుకే మల్లెమాల టీం రష్మీ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అన్నది తెలుస్తుంది. దీంతో స్టార్ మా యాజమాన్యం ఆఫర్ చేసిన భారీ రెమ్యూనరేషన్ తో బిగ్ బాస్ లోకి వెళ్లాలని రష్మి అనుకున్నప్పటికీ యాజమాన్యం మాత్రం అగ్రిమెంట్ తెరమీదికి తెచ్చి వద్దు అని చెప్పడంతో చివరికి రష్మికి నిరాశే ఎదురవుతుంది అన్నది తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.