తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మాస్ క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగుతున్నాడు గోపీచంద్. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.  అయితే గోపీచంద్ కెరీర్ హీరోగా కాకుండా విలన్గా మొదలైంది అన్నది తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.  అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన జయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్.



 ఇక మొదటి సినిమాలో విలన్ పాత్రలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సాధించింది.  ఈ సినిమాతోనే అటు నితిన్ కూడా హీరోగా పరిచయమయ్యాడు.  ఇక ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం అనే సినిమాలో కూడా విలన్ పాత్రలో ఒక సరికొత్త గెటప్ లో నటించి గోపీచంద్ ఆకట్టుకున్నాడు.  ఇక విలన్ పాత్రల నుంచి ఆ తర్వాత హీరోగా అవతారమెత్తాడు గోపీచంద్.  హీరోగా కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ సంపాదించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.



 కానీ గత కొన్ని రోజుల నుంచి గోపీచంద్ కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి తేజ దర్శకత్వంలో విలన్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం తేజ ఒక వైవిధ్యమైన కథతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. ఇక ఈ సినిమాలో మరోసారి తేజ తన పాత విలన్ అయిన గోపీచంద్ ను ప్రతినాయకుడి పాత్ర కోసం తీసుకోబోతున్నాడు అన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోంది.  ప్రతినాయకుడి పాత్రలో నటించి ఎంతగానో రక్తికట్టించే గోపీచంద్ మరోసారి తేజ దర్శకత్వంలో విలన్ గా మారిపోతుండటంతో అభిమానుల్లో ఎంతో ఆతృత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: