టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సారి కలిసి నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ఫిల్మ్ రౌద్రం, రణం, రుధిరం. తెలుగు తో పాటుగా వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. డీ. వి. వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా పై రెట్టింపు స్థాయిలో అంచనాలు పెంచింది.ఇటీవల కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఆగిపోయింది.

ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా షూటింగ్ కి రెడీ అంటోందట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.సినిమాలో చరణ్ సరసన సీతగా నటిస్తోంది ఆలియా.ఈ సినిమాతో పాటుగా హిందీలో గంగుభాయ్ అనే సినిమా కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇటివలే కరోనా బారిన పడి దాదాపు నెల రోజుల వరకు విశ్రాంతి తీసుకున్న ఈమె. ఇప్పుడు పూర్తిగా కోలుకోని మళ్ళీ షూటింగ్స్ కి రెడీ అయ్యింది.ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈమె నటిస్తున్న గంగుభాయ్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలింది. ఇక తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో ఆ పాటకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యిందట ఆలియా.

ఈ మేరకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి కి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.జూన్ 15 తర్వాత ఆ పాటకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొననుందట ఈ హీరోయిన్.దాని అనంతరం rrr షూటింగ్ లో పాల్గొనాలని ఇటీవల ఈ విషయం రాజమౌళికి సమాచారం ఇచ్చారట.ఈ మేరకు వీలైనంత త్వరగా షూటింగ్ కి ఏర్పాటు చేయమని కోరినట్లు సమాచారం.దీంతో జక్కన్న అండ్ టీమ్ మొత్తం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి షూటింగ్ కి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు అనుమతి వచ్చాక లేటెస్ట్ షెడ్యూల్ లో ఆలియా భట్ కి సంబంధించిన అన్ని సన్నివేశాలను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: