టాలీవుడ్లో ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి దూకుడుమీదున్నాడు మహేష్ బాబు.ఇటీవల ఈ హీరో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుని.. మహేష్ కి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న మహేష్. తన తదుపరి సినిమాని గీతా గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.'సర్కారు వారి పాట'అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ  సినిమాకు సంబంధించి దుబాయ్ లో ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు.ఇంతలోనే కరోనా సెకండ్ వేవ్ విజృభించడంతో షూటింగ్ ని నిలిపివేశారు.

ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ మొదటిసారి హీరోయిన్ గా నటిస్తోంది.బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని..ఈ సినిమాలో మహేష్ భిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో మహేష్ చేయబోయే రోల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.మహేష్ ఈ సినిమాలో ఒక చార్టెడ్ అకౌంట్ పాత్రలో కనిపిస్తాడట.మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక మరో ప్రచారంలో భాగంగా సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో మహేష్ కనిపించనున్నాడట.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు తగ్గాక ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టి నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో వీరి కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా స్క్రిప్ట్ ను పక్కాగా ప్రిపేర్ చేసుకున్నాడట త్రివిక్రమ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: