టాలీవుడ్లో ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు లోకి రావడానికి ముందే విశేష ప్రేక్షకాభిమానాన్ని పొందిన సాయి పల్లవి ఆ తరువాత తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయిగా అదరగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత అవకాశాలు ఇవ్వడం లో పోటీపడ్డారు మన దర్శక నిర్మాతలు. సెలెక్టెడ్ పాత్రలు మాత్రమే చేసుకుంటూ వచ్చే సాయిపల్లవి తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా పాత్రలు చేసుకుంటూ వచ్చి క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు మరే టాలీవుడ్ హీరోయిన్ చేతిలో లేవని చెప్పాలి. తన నటనతో డాన్స్ తో యూత్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఆరు నెలల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా వీరిలో ముందుగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా కి ముందే ఈ సినిమా రిలీజ్ కు రెడీ కాగా లాక్ డౌన్ కారణంగా విడుదలను వాయిదా వేశారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి.

థియేటర్లు ఓపెన్ అవగానే మంచి రోజు చూసుకొని ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది గ్యాప్ లోనే ఆమె నటించిన మరో చిత్రం విరాటపర్వం సినిమా కూడా థియేటర్లలోకి రాబోతుంది. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది.  ఎట్టకేలకు ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. నాని హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను డిసెంబర్ లోపు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: