టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు బుచ్చిబాబు.టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు ఉప్పెన సినిమతో దర్శకుడిగా మారాడు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఏకంగా 100కోట్ల క్లబ్ లో చేరింది.ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ డెబ్యూ డైరెక్టర్ కి రాని గుర్తింపు దర్శకుడు బుచ్చిబాబుకి ఈ సినిమా ద్వారా వచ్చింది. కానీ ఎంతోస్తే ఏం లాభం చెప్పండి.ఉప్పెన సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. తన నెక్స్ట్ మూవీ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఈ దర్శకుడు.

ఒక్క చాన్స్ అంటూ.. టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడట బుచ్చిబాబు.తన మొదటి సినిమా చాలా బాగుందంటూ కేవలం ప్రేక్షకులే కాదు..టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు..ఇలా అందరూ బుచ్చిబాబు డైరెక్షన్ తోపు, తురుమని పొగిడారు. కానీ సినిమా ఛాన్స్ మాత్రం ఈ ఒక్కరూ ఇవ్వలేదు.ఉప్పెన సినిమా తర్వాత ఈ డైరెక్టర్ కి వరుస ఛాన్సులు వస్తాయని అనుకున్నారందరూ. కానీ కథ అడ్డం తిరిగింది.తన రెండో సినిమా కోసం కథలు పట్టుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికే తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టిన బుచ్చిబాబు..

ఆ మధ్య ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించాడట.అయితే తారక్ మాత్రం ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ తో బిజీగా ఉండి..బుచ్చిబాబు చెప్పిన కథని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.దీంతో ఆలోచనలో పడ్డ బుచ్చిబాబు.. పనిలో పనిగా తాజాగా అల్లు అర్జున్ కి కూడా ఓ స్టోరీ లైన్ ని నెరేట్ చేసాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.ఇక ఈ ఇద్దరిలో ఓ హీరో కూడా ఒకే చెప్పలేదట.ఆ హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం బుచ్చిబాబు ఇంకా ఎదురుచూస్తున్నాడట. మరి మొదటి సినిమాతోనే దర్శకుడిగా 100కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమా తీసిన ఈ డైరెక్టర్ కి ఏ హీరో సెకండ్ మూవీ ఛాన్స్ ఇస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: