ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందేశాత్మక సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు చేసే కొరటాల ఎంతో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిశర్మ సంగీతంసారథ్యం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పిక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనకు అన్ని రకాల భాషల నుంచి సినిమాలు చేయాలని పిలుపు వచ్చేది. ఆ విధంగా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చేవి కానీ ఆయన తెలుగు మీద ఉన్న ఇష్టంతో ఇక్కడ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే ఆయనకు హాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.. అయితే ఆ సినిమా ను అయన చాలా సున్నితంగా తిరస్కరించారు.. ఓ హాలీవుడ్ డైరెక్టర్ చిరు నటన ను చూసి ఓ సినిమా ని తెరకెక్కించాలని రాగా తనకు తెలుగు వారిని ఎంటర్ టైన్ చేయడానికే సమయం సరిపోవట్లేదని చెప్పి రిజెక్ట్ చేశారట.. ఏదేమైనా తెలుగు ప్రేక్షకుల కోసం బంగారం లాంటి ఛాన్స్ ను వదులుకున్నాడు చిరు..